క్రికెట్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుని, భారతరత్నంతో మెరిసిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురువారం 41వ యేటలోకి అడుగుపెట్టారు. ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు యూఏఈ వెళ్లిన సచిన్.. తన పుట్టినరోజు వేడుకల కోసం రెండు రోజుల క్రితం ముంబైకు చేరుకున్నారు.
ఆయన తన నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. గతేడాది నవంబర్లో క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగిన తర్వాత సచిన్కు ఇదే తొలి పుట్టిన రోజు. 1973 ఏప్రిల్ 24న సచిన్ ముంబైలో జన్మించిన విషయం తెల్సిందే.