టెన్నిస్: దిగజారిన సానియా ర్యాంకు

తాజాగా ప్రకటించిన డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో హైదరాబాద్ మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మూడు స్థానాలు దిగజారింది. సానియాతో పాటు ఏటీపీ ర్యాంకుల్లో భారత టెన్నిస్ యువకెరటం సోమ్‌దేవ్ దేవవర్మన్, టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి తదితరులు తమ ర్యాంకులను దిగజార్చుకున్నారు.

సింగిల్స్‌లో సానియా మూడు స్థానాలు దిగజారి 83వ ర్యాంకుకు చేరగా.. డబుల్స్‌లో మాత్రం 49వ ర్యాంకులోనే కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో సోమ్‌దేవ్ ఒక స్థానం కోల్పోయి 153వ ర్యాంకుకు, అలాగే ప్రకాశ్ అమృతరాజ్ కూడా ఒక స్థానం దిగజారి 264వ ర్యాంకుకు పడిపోయారు.

పురుషుల డబుల్స్ విభాగంలో మహేశ్ భూపతి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. అదేవిధంగా భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఆరో స్థానంలో యథావిధిగా కొనసాగుతున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ కుర్రాడు విష్ణువర్ధన్ 14 స్థానాలు కోల్పోయి 444వ ర్యాంకుకు పడిపోయాడు. అయితే యూకీ బాంబ్రీ మాత్రం ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకుని 498వ ర్యాంకుకు చేరుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి