ఐటీపీఎల్ ముంబై ఫ్రాంఛైజీ సహ యజమానిగా సచిన్!!

బుధవారం, 16 ఏప్రియల్ 2014 (11:30 IST)
File
FILE
ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సహ యజమానిగా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నారు. తమిళనాడుకు చెందిన మీడియా కంపెనీ ఒకటి పీవీపీ గ్రూపుతో కలిసి ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. దీనికి సచిన్ సహ యజమానిగా ఉంటారు.

ఇప్పటికే సచిన్ ఇండియన్ సూపర్ లీగ్‌లో కొచ్చి ఫ్రాంఛైజీనీ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు తాజాగా ఐటీపీఎల్ ముంబై ఫ్రాంఛైజీని తీసుకున్నట్టు సమాచారం. దీనిపై పీవీపీ గ్రూపు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ, సచిన్ వంటి లెజెండ్‌తో కలసి భాగస్వామ్యం అవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి