కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించిన గరిమా చౌదరి

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (14:59 IST)
File
FILE
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల గరిమా చౌదరి జులై నెలలో లండన్‌లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. జూడోలో ఇప్పటికే అనేక పతాకాలు సాధించిన గరిమా చౌదరి 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌కు కూడా 63 కిలోల విభాగంలో అర్హత సాధించిన విషయం తెల్సిందే.

అంతేకాకుండా, ఈ యేడాది నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన 7వ దక్షిణ ఆసియా ఛాంపియన్ షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో పతకాన్ని సాధిస్తానని గరిమా చౌదరి ధీమా వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి