కోర్టులో పిస్టోరియస్ దొంగ ఏడుపులు.. నటనలో శిక్షణ తీసుకున్నాడట!

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (12:17 IST)
FILE
తన ప్రియురాలిని కాల్చిచంపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ నటనలో శిక్షణ తీసుకున్నాడని, అందుకే కోర్టులో దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఈ కేసు విచారణలో భాగంగా పిస్టోరియస్ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ గట్టిగా ఏడవడంతో పాటు వాంతులు చేసుకున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం గమనార్హం. దక్షిణాఫ్రికా కాలమిస్టు జాని అలన్, పిస్టోరియస్‌పై ఈ ఆరోపణలు చేసింది.

"నాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోర్టు విచారణకు ముందు నువ్వు నటనలో శిక్షణ తీసుకున్నావు. నీతో నటింపజేసేందుకు కోచ్ చాలా కష్టపడ్డాడు" అని తన వెబ్‌సైట్‌లో పిస్టోరియస్‌ను ఉద్దేశించి అలన్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ ఆరోపణలను ఆస్కార్ కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి