సోమవారం మధ్యాహ్నం సీపీఆర్వో గదిలో కూర్చున్న జర్నలిస్టులను భద్రతా సిబ్బంది బలవంతంగా బయటికి పంపించేశారు. మీడియాను అనుమతించవద్దని పౌరసంబంధాల అధికారి తమను ఆదేశించారని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రత్యేక భద్రత దళం (ఎస్పీఎఫ్) సూచించారు. దీంతో మీడియా ప్రతినిధులంతా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ బయటికి వచ్చారు.
సీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మంత్రుల కార్యక్రమాలకు కూడా వెళ్లలేదు. దీంతో జర్నలిస్టుల ఆందోళన విషయం తెలిసిన సీఎంపీఆర్వో కార్యాలయ అధికారులు బయటకు వచ్చి మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవని, వారిని లోనికి రావాలని సూచించగా... దీనికి మీడియా ప్రతినిధులు నిరాకరించారు. ఈ విషయంపై ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణకు ఫిర్యాదు చేశారు.