మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భార్య జీవ(60) మంగళవారం ఉదయం గుండె నొప్పితో కన్నుమూశారు. చెన్నైలోని వారి స్వగృహంలో సోమవారం తెల్లవారు ఝామున జీవాకు గుండె నొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. శ్రీరామరాజ్యం చిత్రానికి సంబంధించిన రికార్డింగ్ కోసం హైదరాబాద్లో వున్న ఇళయరాజా విషయం తెలుసుకొని వెంటనే చెన్నై చేరుకున్నారు.
జీవా ఆకస్మిక మరణంతో కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. జీవా అంత్యక్రియలు ఆమె స్వగ్రామైన తేని జిల్లాలోని పనైపురంలో బుధవారం జరుగనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కాగా ఇళయరాజా - జీవాలకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో యువన్ శంకర్ రాజ, భావతరిణి తండ్రి బాటలో పయనిస్తున్నారు. ఇళయరాజను పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఓదార్చారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.