తన పిలుపునకు స్పందించి చీపురు పట్టి వీధులు ఊడ్చిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శభాష్ అంటూ అభినందించారు. యువతకు, ఇతరులకు సల్మాన్ ప్రచారం స్ఫూర్తిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్లో ప్రజలు పాలుపంచుకునేందుకు సల్మాన్ సేవలు స్ఫూర్తిగా నిలుస్తాయని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ మంగళవారం ముంబైలోని కజ్రాత్ ప్రాంతంలో క్లీనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని తన ఫేస్ బుక్లోని ఫ్యాన్స్, తన ట్విట్టర్ ఖాతాలోని ఫాలోవర్స్తోపాటు, అమీర్ ఖాన్, అజీమ్ ప్రేమ్ జీ, చందా కొచ్చర్, ఒమర్ అబ్దుల్లా, ప్రదీప్ దూత్, రజత్ శర్మ, రజనీకాంత్, వినీత్ జైన్లను సల్మాన్ ఖాన్ నామినేట్ చేశారు.