ప్రముఖ నటుడు, కొరిగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా బాలీవుడ్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. నయనతార ప్రేమాయణం కటీఫ్ అయ్యాక ఇక పిల్లల భవిష్యత్తే ముఖ్యమని తేల్చుకుని.. సినీ షూటింగ్లలో బిజీ అయ్యాడు. ఇందులో భాగంగా తెలుగులో పౌర్ణమి, సమ్థింగ్ సమ్థింగ్ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన ప్రభుదేవా.. తాజాగా హిందీలో మగధీర సినిమాను రీమేక్ చేయనున్నాడు.
రాజమౌళి రూపొందించిన 'మగధీర' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నాడియాడ్ వాలా ఈ హక్కులను భారీ రేటుకి తీసుకున్నాడు. ఇందులో హీరోగా నటించడానికి షాహిద్ కపూర్ ముందుకు వచ్చాడు.