బాలీవుడ్ హాటెస్ట్ లవ్ జంటల్లో టాప్ ప్లేస్లో నిలిచిన జంట రణ్బీర్ కపూర్ - కత్రినాకైఫ్లది. ఈ జంటని చూసి కుళ్ళుకున్న వాళ్ళెంతమంది ఉన్నారో వారితో పాటు ఈ జంటని చూసి మురిసిపోయినవారు లేకపోలేదు. తమ వివాహం ఎప్పుడూ అని అడిగితే మాత్రం ఈ జంట తెగ సిగ్గుపడిపోతుంటారు. కానీ వీరి గురించి ఓ ఆసక్తికర విషయం వెలువడింది. అదేంటంటే... ఎడమొహం పెడమొహంగా ఉన్న రణ్బీర్, కత్రినాలు ఈ మధ్య రహస్యంగా కలుసుకున్నారట.
కత్రినా మాత్రం ఏమాత్రం జంకకుండా రణబీర్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా కనిపించిండంతో ఆ స్నేహితురాలు ప్రేమికుల మధ్య తానెందుకన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయిందట. ప్రస్తుతం రణ్బీర్, కత్రినా కలిసి అనురాగ్ బసు చిత్రం 'జగ్గాజాసూస్'లో నటిస్తున్నారు. కానీ వీరిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకోనంతగా గొడవపడిన అనంతరం ఎలా కలుసుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.