ధృవ సినిమా రీమేక్ కావడంతో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. అయినా హిట్ టాక్ను సొంతం చేసుకున్న ధృవతో చెర్రీకి కాస్త మంచి పేరు వచ్చింది. అదే ఊపుతో తదుపరి సినిమాకు తేజ్ రెడీ అయిపోయాడు. ఇందులో భాగంగా సుకుమార్, సమంతలతో కలిసి కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశాడు. దీంతో రామ్చరణ్- సమంత జంటగా కొత్త ప్రాజెక్ట్ మొదలైంది. ప్రస్తుతం సెట్స్ పైనున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
రాజమండ్రిలో చెర్రీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఇంకా త్వరలో పెళ్లికూతురు కానున్న సమంత ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ కొట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది. దాదాపు రెండు వారాల పాటు ఈ ప్రాంతంలో జరిగే ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే చెర్రీతో పాటు ఆయన సోదరి సుస్మిత కూడ వెంట వెళ్లింది. మైత్రి మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.