ఐ, 10 ఎండ్రదుకుళ్లె వంటి సినిమా ఫట్ కావడంతో విక్రమ్ అంటేనే దర్శకులు భయపడిపోతున్నారు. ఆయనతో సినిమా చేస్తే తప్పకుండా ఫట్ అవుతుందేమోనని డిసైడైపోతున్నారు. అయితే విక్రమ్తో కలిసి నటించేందుకు అందాల తార నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నయనతార క్రేజ్తో తప్పకుండా విక్రమ్ తాజా సినిమా హిట్ కాకతప్పదని సినీ పండితులు అంటున్నారు.
ఇప్పటికే నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. థాయ్లాండ్, మలేషియాల్లో ఈ మూవీ షూటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని శింభు తమీన్స్ సంస్థ నిర్మిస్తోంది.