మహిళలు రోజూ గ్లాసుడు కరివేపాకు నీటిని తాగితే?

సెల్వి

బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (13:54 IST)
కరివేపాకు రోజువారీ వంటలలో చేర్చే కరివేపాకును చాలామంది పక్కన తీసి పెట్టేస్తుంటారు. అయితే కరివేపాకులను వాటి సువాసన కోసం వంటలలో ఉపయోగించడమే కాకుండా, అనేక అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి. కరివేపాకుతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కరివేపాకు అనేక ప్రయోజనాలను శరీరానికి అందిస్తుంది. 
 
కరివేపాకును వంటలో కలుపుకోవడమే కాకుండా ఆ కరివేపాకును మరిగించిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. రోజూ ఉదయం కాఫీ, టీలకు బదులు కరివేపాకు నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం.
 
కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగితే, అది జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను దూరం చేస్తుంది. అందుకే ఉదయం లేవగానే కాఫీ, టీలకు బదులు కరివేపాకు నీటిని తాగాలి. ఇది మొత్తం శరీరాన్ని శుభ్రపరుస్తుంది మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 
కరివేపాకులో జుట్టు పెరుగుదలను ప్రేరేపించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కేవలం కరివేపాకు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్యను ఎదుర్కొనే వారు కరివేపాకు నీటిని తాగడం మంచిది. 
 
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం దెబ్బతినకుండా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందాలంటే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగండి. 
 
కరివేపాకులో బ్లడ్ షుగర్ రెగ్యులేటింగ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే కాఫీ, టీలకు బదులు కరివేపాకు నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవచ్చు.
 
కరివేపాకులో పీచుపదార్థాలు ఎక్కువ. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మేలు చేస్తాయి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కరివేపాకు నీళ్లను తాగితే శరీరంలో జీవక్రియలు పెరిగి కొవ్వులు కరిగిపోయే ప్రక్రియ వేగవంతమై త్వరగా బరువు తగ్గవచ్చు.
 
పీచు తర్వాత కరివేపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది.  
 
కరివేపాకు నీరు ఎలా తయారు చేయాలి? 
* ఒక పిడికెడు కరివేపాకు తీసుకోండి. 
* తర్వాత ఒక పాత్రలో ఒక గ్లాసుడు నీళ్లు పోసి మరిగించి ఆరనివ్వాలి. 
* తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో రుచికోసం నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు