గుంటూరుకు చెందిన ఎంపీకి అమ్మాయితో మసాజ్ చేయించా : తారా?!!

గురువారం, 12 ఏప్రియల్ 2012 (21:54 IST)
File
FILE
సెక్స్ రాకెట్‌కు సూత్రధారి అయిన తారా చౌదరి రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్క నిజాన్ని మెల్లగా బహిర్గతం చేస్తోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన తారా.. గత ఆరేళ్ళుగా వ్యభిచారం వృత్తిని చేస్తున్నట్టు తారా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్టు సమాచారం.

ఈ వాంగ్మూలంలో అందరూ ఊహించినట్టుగానే గుంటూరుకు చెందిన ఓ ఎంపీకి, ఆయన తనయులు ప్రధాన కష్టమర్లలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా తారా పంపించిన అందమైన అమ్మాయిలతో మసాజ్ చేయించుకున్న విషయాన్ని ఆమె బహిర్గతం చేసినట్టు సమాచారం.

పైగా.. అదే జిల్లాకు చెందిన ఓ మంత్రిపై మీడియా ముందు బ్యాడ్‌గా చెప్పాలని, అలా చేస్తే బోలెడంత డబ్బు ఇస్తానని సదరు ఎంపీ తనతో చెప్పినట్లు తారా వెల్లడించినట్లు తెలుస్తోంది. తాను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని ఆయన బెదిరిస్తున్నట్లు తారా చెపుతున్న విషయం తెల్సిందే. ఈ మాటలతో కూడిన ఆడియో టేపు ఓ టీవీ ఛానెల్‌ వద్ద ఉన్నట్టు ఆ ఛానెల వర్గాల సమాచారం.

మరోవైపు.. కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్న తారా చౌదరికి ఒకనాటి ప్రజారాజ్యం పార్టీ మహిళా నేత, అడ్వకేట్ శోభారాణి అండగా నిలిచారు. తారాపై మోపిన అభియోగాలు ఇంకా రుజువు కాలేదని అందువల్ల ఆమెను దోషిగా చూడటం భావ్యం కాదంటోంది. ఈ సెక్స్ రాకెట్‌లో తార చౌదరీ వెనుక ఉన్న రాజకీయ పెద్ద మనుషులను కఠినంగా శిక్షించాలని శోభారాణి డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి