వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తిన చంద్రబాబు

FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు, మాజీ ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి సొమ్ముతో పేపర్, ఛానెల్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా వార్తలు రాసేసుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

స్వతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎవరికి చేయనంత అన్యాయాన్ని తండ్రి వైఎస్సార్ చేస్తే, భారీ అవినీతి సొమ్ముతో జగన్మోహన రెడ్డి పేపర్, ఛానెల్‌ను నడుపుతున్నారని బాబు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఎమ్మార్, రహేజా ప్రాజెక్టుల ఒప్పందాలను మార్చి వేసి డబ్బులు కొట్టేశారని బాబు ఆరోపించారు.

కాగా, ఆదివారం తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, కార్యవర్గ సభ్యుల నూతన కార్యవర్గంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగదన్నారు. స్వంతంత్రంగా వ్యవహరించే మహిళలందరూ సమాజ హితం కోసం ముందు ఉండాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి