నాగుల చవితి పర్వదినాన.. నాగుపాములకు తెలుగు రాష్ట్ర ప్రజలంతా పూజలు చేశారు. పుట్టల చుట్టూ ప్రదక్షణలు చేశారు. కోరుకున్న కోరికలను నెరవేర్చు తల్లీ అంటూ ప్రార్థించారు. ఇంకా నాగుల చవితి రోజున పాము కనిపిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. విశాఖ, జోడుగుళ్లపాలెంలో వాలీబాల్ కోర్టు వద్ద గురువారం అచ్చం పాము కనిపించింది.
జోడుగుళ్ల పాలెం మత్స్యకారులు వేట పూర్తయ్యాక జోడుగుళ్ల పాలెం బీచ్లో ఆర బెట్టుకుంటారు. అలా ఆరబెట్టిన వలల్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నాగుపాము చిక్కుకుంది. బయటపడేందుకు వీలులేక పోవడంతో అక్కడే చుట్టుకుంది. కాగా, ఇక్కడి కోర్టులో వాలీబాల్ క్రీడకారులు లక్ష్మణ్, బుజ్జి సాధన చేస్తున్నారు. బాల్ వలలవైపు వెళ్లిపోవడంతో తెచ్చుకునేందుకు వీరు అటుగా పరిగెత్తారు.