వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

దేవీ

శనివారం, 28 జూన్ 2025 (20:34 IST)
Anuradha, producer Sriram
ZEE5 ఇప్పుడు ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ అనే ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో అలరిస్తోంది.  సోషల్ మీడియా సెన్సేషన్ అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై KV శ్రీరామ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ జూన్ 27 నుంచి ZEE5లో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం నాడు టీం సక్సెస్ మీట్ నిర్వహించింది.
 
 ఈ కార్యక్రమంలో జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ, మేం వంద శాతం ఒరిజినల్ కంటెంట్, షోలను తీసుకు వచ్చాం. మేం ఎన్నో ఐకానిక్ షోలను చేశాం. మేం వేసిన బాటలో ఎంతో మంది నడిచారు. మేం ఎన్నో ఒరిజినల్ ఐడియాస్‌ను క్రియేట్ చేశారు. ‘ఆరంభం ఒక్క అడుగు’తో అంటూ ఇక్కడి వరకు వచ్చాం. ఓటీటీ సంస్థల్లో మేం స్టాండర్డ్స్‌ను సెట్ చేశాం. గాలివాన, ఏటీఎం, పరువు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, పులి మేక ఇలా ప్రతీ చోటా మేం ఒరిజినల్ కంటెంట్‌తోనే వచ్చాం. పులి మేక అనేదే ఫస్ట్ ఫీమేల్ కాప్ స్టోరీ. ఆ తరువాత ఎన్నో కాప్ స్టోరీలు వచ్చాయి. ఓటీటీల్లో ఎన్నో కాప్ స్టోరీలున్నాయి. ఓ కాప్ స్టోరీ కావాలని నేనే దివ్యను అడిగాను. అప్పుడే దివ్య సొంతంగా ఈ కథను రాసుకున్నారు. మేం జరిగిన వివాదం గురించి మాట్లాడం. 
 
మా కంపెనీ పాలసీని దాటి మేం మాట్లాడం. వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు మేం ఏమీ మాట్లాడకూడదు. ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా మా సిరీస్‌కు ఇంతటి రెస్పాన్స్ వచ్చింది. మేం ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, హద్దుల్ని చెరిపి వేస్తూ వచ్చాం.. ఇంకా ఇలాంటి పాత్ బ్రేకింగ్ కంటెంట్‌తో వస్తూనే ఉంటాం. సత్యమేవ జయతే. మేం మా కాంపిటీటర్స్ పట్ల ఎంతో గౌరవం ఉంది. మా సంస్థను కించపర్చేలా మాట్లాడిన వారిపై పరువునష్టం దావా వేశాం. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంద’ని అన్నారు.  
 
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘‘రెక్కీ’తో మేం సక్సెస్ సాధించాం. రెక్కీతోనే నేను వెబ్ సిరీస్‌లు నిర్మించడం ప్రారంభించాను. నాకు జీ5లో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అను మేడంకు థాంక్స్. ఆమె ఇచ్చిన సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. ‘రెక్కీ’ తరువాత ఎన్నో కథలు వింటే ‘విరాటపాలెం’ పాయింట్ నన్ను హంట్ చేసింది. ‘రెక్కీ’ చాలా కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చుతుందని ప్రమోషన్స్‌లో చెప్పాం. ఇప్పుడే అదే జరుగుతోంది. ‘విరాటపాలెం’ను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం ఇక్కడ ఎవ్వరి గురించి మాట్లాడటానికి రాలేదు. మా మాటలే కంటే మా విజయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు