ఇదిలా ఉంటే.. వివాహాలైనా ప్రేమ బంధాన్ని వీడలేక చనిపోయేందుకు ఓ ప్రేమ జంట సిద్ధపడింది. ఈ ఘటన పీలేరు మండలంలో చోటుచేసుకుంది. పీలేరు వెంకటాద్రి ఇండ్లు ప్రాంతానికి చెందిన ఎం. మల్లికార్జున (25), పాకాల మండలం మొగరాల పంచాయతీకి చెందిన పూజిత (21) ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని పెద్దలు రెండున్నరేళ్ల క్రితం పూజితకు వివాహం చేశారు.
అలాగే మల్లికార్జునకు కూడా మూడు నెలల క్రితం బంధువుల అమ్మాయితో వివాహం జరిగింది. కానీ ప్రేమ బంధాన్ని వీడలేక గురువారం వీరిద్దరూ విషం తాగారు. అపస్మారకస్థితిలో ఉన్న మల్లికార్జునను, పూజితను పీలేరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇరువురు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంటున్నారు.