తిరుపతి - రేణిగుంట రోడ్డులోని నారాయణ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కమలేష్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నారాయణ కళాశాలలోని అబ్దుల్ కలాం బ్లాక్లో కమలేష్ ప్రస్తుతం విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత తన బ్లాక్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.