అనుకుంటే ఎంతసేపు.. తాడేపల్లి ప్యాలెస్‌ను కూల్చడానికి ఒక్క నిమిషం చాలు..!

బుధవారం, 5 ఏప్రియల్ 2023 (21:35 IST)
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లేదా అంతకంటే ముందుగా ఎన్నికలు జరిగినా విజయం తెలుగుదేశం పార్టీకేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యూనియన్‌ నేతలతో సమావేశమయ్యారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురిచేస్తోందని, వారిపై తప్పుడు కేసులు పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. 
 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కారును చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. అనుకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ను ఒక్క నిమిషంలోపే కూల్చివేయవచ్చని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి చేదు గుణపాఠమని పేర్కొన్నారు.
 
ప్రతిపక్షాల నుంచి టీడీపీని తరిమికొట్టాలన్న సీఎం జగన్ ప్లాన్ కేవలం కల మాత్రమేనని, అది నెరవేరదని చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీని ఇంటికి పంపిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని టీడీపీ అధినేత ధీమా వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు