ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీల మెంబర్లు ఖరారయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించిన శాసనసభ వాటిని మండలికి పంపింది. అయితే ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి నిర్ణయించింది.
సభ్యులుగా దీపక్రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, శ్రీనివాసులు, మహ్మద్ ఇక్బాల్, వెంకటేశ్వరరావు, సోము వీర్రాజు ఉంటారు.
ఇక అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీకి బుగ్గన రాజేంద్రనాథ్ ఛైర్మన్గా ఉంటారు. సభ్యులుగా అశోక్బాబు, నారా లోకేష్, తిప్పేస్వామి, సంధ్యారాణి, గోపాల్రెడ్డి, లక్ష్మణరావు, మాధవ్ ఉంటారు. ఒక్కో సెలక్ట్ కమిటీలో 9 మంది ఉన్నారు.
శానసమండలి రద్దు ఏకపక్ష చర్య: బీజేపీ
శానసమండలి రద్దు ఏకపక్ష చర్య అని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఈ విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలని సూచించారు. రాజధాని బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లినా ఆమోదం పొందుతాయన్నారు.