వహ్ 'వండర్' తాజ్

బుధవారం, 19 డిశెంబరు 2007 (18:20 IST)
07-07-07న కొత్తగా ప్రపంచంలోని ఏడు వింతలలో భారతీయుల ప్రేమచిహ్నం తాజ్‌మహల్ స్థానం సాధించింది. తాజ్‌మహల్‌ను ఎలాగైనా ప్రపంచ ఏడు వింతల జాబితాలో నమోదు చేయించాలని వివిధ సంస్థలు చేసిన కృషి ఫలించింది.

ఏడువింతల సరసన తాజ్‌ను నిలబెట్టేందుకు వ్యక్తులు, సంస్థలు అన్న తేడా లేకుండా అందరూ వినూత్నంగా ప్రచారం చేశారు. తాజ్ స్థానం కోసం భారతీయులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ల ద్వారా దాదాపు వంద మిలియన్లమంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఏడు వింతలలో తాజ్‌మహల్‌తోపాటు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, జోర్డాన్‌లోని పెట్రా, బ్రెజిల్‌లోని క్రైస్ట్ రీడీమర్ విగ్రహం, పెరూలోని మచూ పిచూ, మెక్సికోలోని చిచెన్ ఇట్జా పిరమిడ్, రోమన్ కొలోసియం స్థానం సంపాదించాయి.

వెబ్దునియా పై చదవండి