సార్వత్రిక సమరం : మరికొందరు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

వరుణ్

బుధవారం, 10 ఏప్రియల్ 2024 (09:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకేసారి జరుగనున్నాయి. మే 13వ తేదీన జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రటించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరికొందరు అభ్యర్థులతో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఆరుగురు లోక్‌సభ, 12 మంది అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఉన్నారు. తాజాగా వెల్లడించిన అభ్యర్థుల జాబితాలో పేర్కొన్న అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే...
 
లోక్‍‌సభ అభ్యర్థులు... 
విశాఖపట్టణం - పలుసు సత్యనారాయణ రెడ్డి
అనకాపల్లి - వేగి వెంకటేశ్
ఏలూరు - కావూరి లావణ్య
నరసరావుపేట - గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ 
నెల్లూరు - కొప్పుల రాజు
తిరుపతి ఎస్సీ - డాక్టర్ చింతా మోహన్ 
 
అసెంబ్లీ అభ్యర్థులు..
టెక్కిలి - కిల్లి కృపారాణి
భీమిలి - అద్దాల వెంకట వర్మరాజు
విశాఖపట్టణం సౌత్ - వాసుపల్లి సంతోశ్
గాజువాక - లక్కరాజు రామారావు
అరకు లోయ ఎస్టీ - శెట్టి గంగాధర స్వామి
నర్సీపట్నం - రూతల శ్రీరామమూర్తి 
గోపాలపురం ఎస్సీ - సోడదాసి మార్టిన్ లూథర్
యర్రగొండపాలె ఎస్సీ - డాక్టర్ బూదల అజితారావు 
పర్చూరు - నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
సంతనూతలపాడు ఎస్సీ - పాలపర్తి విజేశ్ రాజ్
గంగాధర నెల్లూరు ఎస్సీ - డి. రమేశ్ బాబు
పూతలపట్టు ఎస్సీ - ఎంఎస్ బాబు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు