అలాంటి వారు అసెంబ్లీలో ఎలా కూర్చుంటారు!?: టీజీ ప్రశ్న

గురువారం, 1 నవంబరు 2012 (12:47 IST)
FILE
రాష్ట్ర అవతరణను అడ్డుకుంటామంటున్నవారు అసెంబ్లీలో ఎలా కూర్చుంటారని భారీనీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకిస్తున్న వారు అసెంబ్లీలో ఎలా కూర్చుంటారు.. రాజ్యాంగ బద్ధంగా ఎలా ప్రమాణం చేస్తారని టీజీ వెంకటేష్ అడిగారు.

రాష్ట్రంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిన ప్రాంతమని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీ వ్యాఖ్యానించారు. కిరణ్ ప్రభుత్వం తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం సీమాంధ్రంలో ఘనంగా జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలో విద్రోహ దినంగా జరుపుకోవాలని మంత్రులు పిలుపునివ్వడంపై టీజీ పైవిధంగా వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి