ఆ ఇద్దరి మధ్య నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది!

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (17:14 IST)
FILE
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి మధ్య నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక అవలంభించగా, జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతో రాజకీయ ఓదార్పు యాత్ర చేస్తున్నారని నారాయణ దుయ్యబట్టారు.

బాబుది రాజకీయ విధానాల వైఫల్యమని, జగన్‌ది అవినీతి విధానాల నేపథ్యమని నారాయణ ఎద్దేవా చేశారు. అలాంటి వారిద్దరికీ పోలిక పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను తన్నేందుకే అంతమంది విప్‌లను నియమించారని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ నారాయణ విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి