ఆ నలుగురు ఒక్కటై జగన్‌ను వేధిస్తున్నారు: లక్ష్మీ పార్వతి

గురువారం, 10 మే 2012 (16:31 IST)
FILE
ఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావులు ఒక్కటై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని వేధిస్తున్నారని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) దాడుల వెనుక అసలు సూత్రదారి ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు హస్తముందని గురువారం తిరుపతిలో లక్ష్మీ పార్వతి విలేకరులతో అన్నారు.

రామోజీ రావు సూచనలను సీబీఐ పక్కాగా అమలు చేస్తుందని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. సీబీఐ సంస్థ కాంగ్రెసు కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని లక్ష్మీ పార్వతి విమర్శించారు. ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ కూడా సిబిఐ తీరును తప్పు పట్టారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి