కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు: దేవేందర్ గౌడ్

FILE
కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమ్మక్కయ్యారని, తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో తెరాసను, కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేస్తుందని గౌడ్ సవాలు విసిరారు.

కేసీఆర్ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలను పాల్పడుతున్నారని, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని దేవేందర్ గౌడ్ ఆరోపించారు. త్వరలోనే కేసీఆర్ తెరాసను కాంగ్రెస్ పార్టీలోని విలీనం చేస్తారని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం పేరిట తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయని దేవేందర్ గౌడ్ తెలిపారు. తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెస్తామని, ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి