చిరంజీవి నిద్రపోతున్నారు.. కేంద్రం చర్యలేవి?: దేవినేని ఉమ

FILE
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్ర వాసులు చిక్కుకుని అవస్థలు పడుతుంటే కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి నిద్రపోతున్నారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

తెలుగువారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టి ఉత్తరకాశీ మార్గంలో చిక్కుకుపోయిన యాత్రీకులను రక్షించాలని కోరారు.

భారీ వర్షాలకు గంగానది పోటెత్తి రహదారులను ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడిన కారణంగా చార్ ధామ్ యాత్రలకు వెళ్లిన రాష్ట్ర వాసులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి