జగన్ మోహన్ రెడ్డిని తన హృదయం లోతుల్లో నుంచి చూశానని, అందుకే ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు హీరో శ్రీహరి అన్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్గూడ జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని శ్రీహరి శుక్రవారం ములాఖత్ సమయంలో కలుసుకున్న విషయం తెల్సిందే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే శ్రీహరి జగన్ పార్టీలో చేరతారని, ఆ విషయం జగన్కు చెప్పేందుకు జైలుకు వెళ్లినట్టు చెప్పారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డితో కలిసి నడిచినట్లే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తానని సినీనటుడు శ్రీహరి తెలిపారు.
ఎందుకంటే.. జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే సత్తా ఒక్క జగన్కే ఉందని శ్రీహరి తెలిపారు.