జగన్ కోసం కోట్ల మంది చూస్తున్నారు... వైఎస్ఆర్ సీపీలోకి నేను... శ్రీహరి

శుక్రవారం, 8 ఫిబ్రవరి 2013 (22:39 IST)
WD
జగన్ మోహన్ రెడ్డి కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారనీ, ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనీ, ప్రస్తుతం అధ్వాన్న స్థితిలో ఉన్నదనీ సినీనటుడు శ్రీహరి సినీ నటుడు శ్రీహరి అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధపై పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ మోహన్‌ను హీరో శ్రీహరి శుక్రవారం కలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. జగన్‌తో కలిసే వైఎస్ఆర్ సీపీలో చేరినంత ఆనందంగా ఉందన్నారు. కష్టకాలంలో జగన్ ఉన్నారనీ, అందువల్ల ఆయనకు అండగా నిలువాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

ఇదిలావుండగా... వచ్చే ఎన్నికల్లో శ్రీహరి పోటీ చేస్తామని ప్రకటించడంతో అపుడే ఆయన పోటీ చేసే స్థానంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. సినీ నటి జయసుధ సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే జగన్ పార్టీ తరపున శ్రీహరి బరిలోకి దిగే సూచనలు ఉన్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి