టీవీ చూడటానికి రమ్మన్నాడు... తలుపు వేసి రేప్ చేశాడు!

మంగళవారం, 6 ఆగస్టు 2013 (13:17 IST)
FILE
దేశంలో ఆడవారికి బద్రత లేకుండా పోతోంది. నానాటికి సమాజం దిగజారిపోతుంది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలతో దేశం అట్టుడుగుపోతోంది. తాజాగా చిత్తూరు జిల్లాలోని ఓ అత్యాచారం కేసు నమోదయ్యింది. చిత్తారు జిల్లా కలకడ మండలంలోని ఎర్రకోటపల్లె పంచాయితీ సింగనొడ్డుపల్లెలో ఆదివారం బాలికపై అత్యాచారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సింగనొడ్డుపల్లి గ్రామానికి చెందిన బాలిక (16)ను అదే గ్రామానికి చెందిన నాగరాజు (40) ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో టీవీ చూడటానికి తన ఇంటికి రమ్మని పిలిచాడు. అమ్మాయి ఇంటిలోకి రాగానే తలుపు వేసి గడియపెట్టాడు. తదుపరి అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెబ్దునియా పై చదవండి