తెలంగాణాకు ముందే ఉత్తరాంధ్ర విడిపోవాలి: వంగపండు

తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందే ఉత్తరాంధ్ర విడిపోవాలని ప్రజా గాయకుడు వంగపండు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడమంటూ జరిగితే మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలని, తెలంగాణ, సీమాంధ్ర పేరుతో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని వంగపండు వ్యాఖ్యానించారు.

ఉత్తరాంధ్రలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని, కానీ వెనుకబడిన ఉత్తరాంధ్రను ఎవరూ పట్టించుకోవడం లేదని వంగపండు ఆరోపించారు. ఉత్తరాంధ్ర కోరూతూ సైకిల్ యాత్ర చేసిన వారి అరెస్టుకు నిరసనగా వంగపండు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా వంగపండు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అన్నారు. రాష్ట్రం విడిపోతే విశాఖపట్నంను రాజధానిగా చేసి లక్షకోట్ల ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి