నిజాయితీకి నిదర్శనం లోక్‌సత్తా: జయప్రకాష్

FILE
ప్రస్తుతం దేశవ్యాప్తంగానున్న రాజకీయాలలో కేవలం రాష్ట్రంలోనున్న రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, రాష్ట్రంలో తమదే నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీ అని, దీనికి నిదర్శనమే తమ పార్టీ అని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.

లోక్‌సత్తా పార్టీ స్థాపించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ పట్ల రాష్ట్ర ప్రజలలో గౌరవం ఉందన్నారు. తమ పార్టీ అనుసరిస్తున్న విధి విధానాలపట్ల ప్రజలలో ఆసక్తి పెరుగుతోందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ అధికారాన్ని సాధారణ ప్రజలలోకి తీసుకు వెళ్ళేందుకు తమ పార్టీ అకుంఠిత దీక్షతో కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం యువతకు కొత్త రకమైన రాజకీయాలు చాలా అవసరమని, ప్రతి ఒక్కరికి నిర్బంధ విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను పెంపొందించుకునేందుకు తగిన నైపుణ్యాన్ని వారిలో ఇనుమడింపచేసేందుకు తగిన పద్ధతులను తాము అవలంబిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

తమ పార్టీ కార్యకర్తల్లో నిజాయితీ మెండుగా ఉందని, ఇదే తమ పార్టీకి బలమని, ప్రస్తుతం విద్యావంతులు, రైతులు తమ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని, భవిష్యత్తులో పార్టీని మరింతగా అభివృద్ధి చేసి ప్రజలలోకి తీసుకు వెళ్ళి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తాము శతవిధాలా ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి