పడగవిప్పిన పాతకక్షలు : తెదేపా నేతలపై దాడులు!

గురువారం, 27 అక్టోబరు 2011 (12:53 IST)
అనంతపురం జిల్లా మరోమారు పాతకక్షలతో భగ్గుమంది. ఈ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రత్యర్థులు గురువారం తెల్లవారుజామున వేటకొడవళ్లతో దాడి చేశారు. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉంది.

అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లిలో తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కొందరు దుండగులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

గ్రామంలో రేషన్ షాపు కేటాయింపుతో పాటు గత పంచాయతీ ఎన్నికల్లో ఏర్పడిన వివాదాలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. అయితే, ఈ దాడికి ఎవరు పాల్పడ్డారో ఖచ్చితంగా తెలియరాలేదు.

వెబ్దునియా పై చదవండి