మంత్రి పదవికి పొన్నాల అనర్హుడు: చంద్రబాబు

FILE
రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రిగా పొన్నాల లక్ష్మయ్య అనర్హుడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. సీడబ్ల్యూసీ హెచ్చరికలను లెక్కచేయకపోవడం వల్లే కర్నూలుకు వరద నష్టం ఎక్కువైందని బాబు చెప్పారు.

మొత్తానికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్రం వరద ముంపుకు గురైందని చంద్రబాబు ఆరోపించారు. శనివారం ఆయన కర్నూలు జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వరద బాధితులను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రత్యక్షంగా చూడకుండానే అధికారుల నివేదికల ఆధారంగా అడ్వాన్స్‌గా రూ.1000కోట్లు ప్రకటించారన్నారు. ఆ సాయం ఏపాటికి వస్తుందని బాబు పెదవి విరిచారు.

రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా వంటి జిల్లాలను ముంచెత్తిన వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ఎందుకు బహిరంగం ప్రకటించడం లేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రేపల్లె వరదముంపుకు గురవుతుందని ముందే తెలిసినా మంత్రులు షికారుకు వెళ్లినట్లు వెళ్లివచ్చారని బాబు మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి