ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సంతాపసభ

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించి నేటికి నెలరోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంతాపసభ నిర్వహించారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్యతోపాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు, అభిమానులు హాజరై వై.ఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. సినీనటులు జీవిత, రాజశేఖర్, నటుడు, దర్శకుడు ఎస్వీ. కృష్ణారెడ్డి తదితరులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంతాప సభకు హాజరయ్యారు.

ఇదిలావుండగా రోశయ్య నివాళులు అర్పించేందుకు వచ్చినప్పుడు కార్యకర్తలు జగన్ సీఎం కావాలంటూ పదేపదే నినాదాలు చేయటంతో ఆయన అక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెనుదిరిగారు.

కాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలతో వై.ఎస్. ఆశయసాధనకు పాటుపడతామని రోశయ్య ప్రతిజ్ఞ చేయించారు.

వెబ్దునియా పై చదవండి