వైఎస్సార్ బతికుంటే జైలుకు వెళ్లి ఉండేవారేమో..!?: ఆనం వివేకా

మంగళవారం, 10 ఏప్రియల్ 2012 (16:50 IST)
FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి బతికివుంటే జైలుకు వెళ్లి ఉండే వారేమోనని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. వైఎస్సార్‌పై అవినీతి ఆరోపణలు రుజువైతే ఒకవేళ జైలుకు వెళ్లి ఉండొచ్చునని వివేకా అభిప్రాయపడ్డారు.

తాము వైఎస్సార్‌కు వారసులం కాదని, కాంగ్రెస్ పార్టీ వారసులమని ఆనం వెల్లడించారు. కాంగ్రెస్ పేరుతో లక్షల కోట్లు సంపాదించుకున్న జగన్ తీరు... తల్లిపాలు తాగి రొమ్ము తన్నే విధంగా ఉందని ఆనం ధ్వజమెత్తారు.

అవినీతికి పాల్పడితే కాంగ్రెసు ప్రభుత్వం ఎంతటి వారలనైనా వదలే ప్రసక్తే లేదన్నారు. అవినీతిపరులు ఎవరైనా జైలుకు పంపిస్తుందని, ఇందుకు సురేష్ కల్మాడీ, కనిమొళి మంచి నిదర్శనమన్నారు.

వెబ్దునియా పై చదవండి