శ్రీహరి : పల్లెల కన్నీటిని తుడిచే గొప్ప మనసున్న నాయకుడు జగనే!

FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడిగా మాట తప్పని, మడమ తిప్పని గుణం కడప పార్లమెంట్ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి సొంతమని ప్రముఖ సినీ నటుడు శ్రీహరి అన్నారు.

మహానేత వైఎస్సార్ ప్రభుత్వం రాకముందు.. రాష్ట్రంలో పల్లెలు ఎలా కన్నీరు పెట్టాయో ప్రస్తుతం అదే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ కన్నీటిని తుడిచే గొప్ప మనసున్న నాయకుడు జగనేనని చెప్పారు.

రాష్ట్రంలో సామాన్యులు దుర్భ రమైన జీవితాన్ని అనుభవిస్తూ నామమాత్రంగా బతుకుతున్నారని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు శుక్రవారం జగన్‌ను కలిసిన అనంతరం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయాలా ? లేక ప్రచార బాధ్యతలు చేపట్టాలా? అనే విషయాలను జగన్‌ నిర్ణయాలకే వదిలేసినట్లు శ్రీహరి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి