సామాజిక న్యాయమే తమ పార్టీ పునాదులు: కత్తి

శుక్రవారం, 31 జులై 2009 (18:55 IST)
తమ పార్టీకి సమాజిక న్యాయమే పునాదులని ప్రజారాజ్యం పార్టీ నేత కత్తిపద్మారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ పార్టీని దెబ్బతీయలేరని ఆయన జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం, ఆ పునాదులపైనే నిలబడి ఉందన్నారు.

పార్టీ ఏర్పాటు అనంతరం చిరంజీవి ఏ ఒక్క నేతను పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. పీఆర్పీలోకి వచ్చిన నేతలందరూ స్వచ్ఛంధంగా వచ్చిన వారేనని గుర్తు చేశారు. స్వప్రయోజనాల కోసం ఆశించి వచ్చిన వారే ఇపుడు పార్టీని వీడి వెళుతున్నారని కత్తిపద్మారావు ఆరోపించారు. ఇలాంటి నేతలు ఎంతమంది వెళ్లిపోయినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి