ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే 11 మంది అరెస్టు.. 107 ద్విచక్ర వాహనాలు, 1 ట్రాక్టర్ స్వాధీనం

గురువారం, 5 ఆగస్టు 2021 (09:49 IST)
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదు కాబడిన  ద్విచక్ర వాహనాల దొంగతనాలను చేధించుటకు జిల్లా ఎస్ పి ఎస్ సెంథిల్ కుమార్, ఐపిఎస్ గారు చిత్తూరు జిల్లా లోని 4 సబ్ డివిజన్ అధికారుల స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పరచడమైనది.

దర్యాప్తు లో భాగంగా ఈ ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా నమోదు అయ్యిన ద్విచక్ర వాహనాల దొంగతనాలను చేధిస్తూ చోరీకి పాల్పడి వాటిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమ్మే 11 మంది దొంగలను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి 107 ద్విచక్ర వాహనాలు మరియు 1 ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకోవడమైనది. 

వీరంతా ద్విచక్ర వాహనాలను ఇంటి అరు బయట పార్కింగ్ చేసి ఉన్నప్పుడు, షాపింగ్ మాల్స్ వద్ద, దుఖానాల వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలను తస్కరించేవారు. చోరీ చేయబడిన వాహనాలను తక్కువ ధరకు అమ్మేవారు.  వీరు చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బులు సంపాదించాలని కోరికతో  ద్విచక్ర వాహనాల దొంగతనం చేసేవారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు