బేతంచెర్లలో విషాదం... క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకిడి మృతి

సోమవారం, 14 ఆగస్టు 2023 (08:48 IST)
ఏపీలోని నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో విషాదకర ఘటన జరిగింది. స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందింది. ఆదివారం స్నేహితులతో క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికులు బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. చేతికొచ్చిన కొడుకు కోల్పోయిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 
 
నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని సంజీవ నగర్ కాలనీకి చెందిన మహేంద్ర (22) ఆదివారం మధ్యాహ్నం తన స్నేహితులో కలిసి ఆడుతూ ఆకస్మాత్తుగా మరణించాడు. కాలనీ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అతడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ యువకుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. చేతికందివచ్చిన కొడుకు హఠాత్తుగా దూరమవుడంతో ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతే లేకుండా పోయింది. 
 
బోనులో చిరుత.. ఎట్టకేలకు బంధించిన తితిదే అధికారులు  
 
తిరుమల నడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. చిరుత పట్టుకునేందుకు సిబ్బంది ఘటనా స్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఫలితంగా తిరుమల - అలిపిరి కాలినడక మార్గంలో ఏదో మైలు రాయి వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కింది.
 
కాగా, ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కాలి నడక మార్గంలో తిరుమలకు వెళుతుండగా అకస్మాత్తుగా చిరుత బాలిక దాడి చేసింది. తల్లిదండ్రుల కంటే ముందు వెళుతున్న బాలికపై రాత్రివేళ దాడి చేసిన చిరుత ఆ తర్వాత పొదల్లోకి చిన్నారిని ఈడ్చుకెళ్లి చంపి తినేసింది. 
 
మరుసటి రోజు ఉదయం బాలిక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగడంతో తిరుమల అదికారుల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెట్ల మార్గంలో చిన్నారులను అనుమతించరాదని వంద మంది భక్తుల చొప్పున ఓ బృందంగా నడక మార్గంలో పంపించేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు