ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ 2026 సెషన్-1లో చాలా మంది గ్రామీణ విద్యార్థులు రాణించారని వదాన్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అశోక్ పడపాటి అన్నారు. ముఖ్యంగా, జేఈఈలో 99.98 శాతంతో జుగేష్ కుమార్, 99.84 శాతంతో తులసి కార్తీక్, 99.78 శాతంతో యెశ్వంత్ కుమార్ అనే ముగ్గురు విద్యార్థులను గురించి ప్రస్తావించారు.
ఇంత పెద్ద పోటీలో, గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి స్కోర్లు సాధించడం నిజంగా ప్రోత్సాహకరంగా ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారి పనితీరు మనోధైర్యాన్ని పెంచుతుందని, సరైన మద్దతు, నిరంతర కృషితో వారు అత్యుత్తమ ఫలితాలను సాధించగలరని ఆయన అన్నారు. నిరంతర మద్దతు ఇచ్చినందుకు వదాన ఫౌండేషన్ అన్ని స్వచ్ఛంద సేవకులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపింది.