టెన్త్ అంటే... ఎవరికైనా టెన్షనే... టెన్త్ రిజల్స్ వచ్చాక... పేపరులో నెంబరు లేకపోతే, కొందరు ఎంతో బాధతో కుంగిపోతారు... రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. కానీ, కంకిపాడులో ఒక విద్యార్థి రిజల్స్ రాక ముందే టెన్షన్ పడి... అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పరీక్షల్లో పాస్ అయినా, జీవితంలో ఫెయిల్ అయ్యాడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన వినయ్ కుమార్ తాను టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానని తప్పుడు అంచనా వేసి, ముందే మనస్తాపం చెందాడు.
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీరా రిజల్ట్స్ చూస్తే, భారీ మెరిట్ సాధించాడు. అతనికి 9.3 పర్సంటేజ్ వచ్చింది. అటు క్విజ్, ఇతర ఆటల్లోనూ బోలెడు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ సాధించిన వినయ్ జీవితం ఇలా విషాదాంతం కావడం.. అతని తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన మిగిల్చింది. ఐతే పిల్లల్లో ఇలాంటి ఆత్మన్యూనతా భావం లేకుండా, ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అటు ఉపాధ్యాయులపైనే కాకుండా తల్లిదండ్రులపై కూడా ఉంది. కేవలం మార్కులే పరమావధిగా ఆలోచనలు ఉండరాదని గ్రహించాలి.