మనిషిని వ్యసనం ఏ స్థాయికైనా దిగజార్చుతుంది. అది ఏ వ్యసనం అనేది ప్రశ్నకాదు. బీడీ సారా, జూదం ఎదైనా కావచ్చు. మనిషి మానసిక స్థితి కుంగదీస్తుంది. కృష్ణా జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది. తన పక్కనున్న వ్యక్తి తనకు బీడీ ఇవ్వలేదని అతనిపై విరుచుకుపడ్డాడో ప్రబుద్ధుడు. చెయ్యి తెగ నరికేశాడు. వివరాలిలా ఉన్నాయి.
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన అవుటుపల్లి జోగి(30) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. జోగి సోమవారం ఉదయం పనికి వెళ్లడానికి సెంటర్కు వచ్చిన అతను పక్కనే ఉన్న కె.ముసలయ్య(50)ను బీడీ అడిగాడు. అతను ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన జోగి తన చేతిలో ఉన్న కత్తితో ముసలయ్యపై దాడి చేశాడు.