ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అదో రకం పిచ్చి అని, ఆయన బావమరిది బాలకృష్ణకు మతిస్థిమితమని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పైగా.. చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి ఉందన్నారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ అధికార పక్షంపై విపక్షాలు విమర్శలు చేస్తే సహృదయంతో స్వీకరించాల్సిన టీడీపీ నేతలు ఎదురు దాడి చేయడం సిగ్గుచేటన్నారు.
అలాగే చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు మతిస్థిమితం లేక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం వాస్తవం కాదా? అని అడిగారు. అంతెందుకు, చంద్రబాబుకు జగన్కు వైద్యపరీక్షలు చేద్దాం, చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడన్నా, జగన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని నివేదిక ఇచ్చినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంబటి రాంబాబు ప్రకటించారు.