పాలనలో తనదైన ముద్ర వేసుకోవడానికి చంద్రబాబు ఎప్పుడూ ముందే ఉంటారు. నిన్నటికి నిన్న కాబినెట్ సమావేశాన్ని పేపర్ లెస్ గా నిర్వహించిన ఆయన శనివారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. సిఎంఓను పూర్తిగా పేపర్ లెస్ గా తయారు చేశారు. మొదటి దశలో భాగంగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం, సిఎంవోలు పూర్తిగా కంప్యూటర్ల మీదనే నడుస్తాయి.
లేదంటే తిరస్కరిస్తున్నట్లు ఫీడ్ చేయాలి. ఇలాంటి ఆప్షన్లున్న సాఫ్ట్ వేర్ తయారు చేస్తారు. ఇందులోనే అన్ని ఫైళ్ళు నడుస్తాయి. ప్రస్తుతానికి సిఎంఓ, చీఫ్ సెక్రటరీ కార్యాలయాలను డిజిటలైజ్ చేస్తారు. అనంతరం రెండో దశలో అన్ని కార్యాలయాలను ఈ కార్యాలయాలుగా మార్చుతారు.