అంతేకాకుండా, తిరుమలలో అన్యమత ప్రచారంపై మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర మతాలను గౌరవిస్తూనే అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే, నవంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో తన సింగపూర్, జపాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి వెల్లడించారు.