ఏపీ రాజధాని కోసం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ రూ.2,52,47,259 విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ సంస్థల తరపున సేకరించిన విరాళం దాదాపు రూ.2.5 కోట్లకు పైగా ఉన్న డబ్బును చెక్ రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ అందజేశారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర రాజధాని కోసం విరాళాలను ఇవ్వాల్సిందిగా ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ పిలుపునిచ్చిన విషయం విదితమే.