అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడకన బయలుదేరిన పవన్ కళ్యాణ్!

ఠాగూర్

మంగళవారం, 1 అక్టోబరు 2024 (17:51 IST)
శ్రీవారి ప్రహా ప్రసాదం లడ్డూ కల్తీ జరిగినట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ దీక్షను విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్‌ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్.. శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.
 
అనంతరం అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలిస్తారు. పవన్‌ కల్యాణ్‌ దీక్ష విరమణ నేపథ్యంలో 30న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు. అక్టోబరు ఒకటో తేదీన 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో పఠించాలని పార్టీ శ్రేణులకు జనసేన అధిష్ఠానం సూచించింది. 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు