'2 ఎకరాల భూమి స్థాయి నుంచి రూ.2 లక్షల కోట్లు సంపాదించిన కిటుకేదో చెబుతారా?' అంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెల్సిందే.
అందరు రాజకీయ నేతలకు భిన్నంగా చంద్రబాబు ఏటా తన ఆస్తులనే కాక తన కుటుంబ సభ్యుల ఆస్తులను సైతం ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. ఏ ఒక్కరూ అడగకున్నా తనకు తానుగా చంద్రబాబు తన ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నా, చంద్రబాబుకు రూ.2 లక్షల కోట్ల ఆస్తులున్నాయని చెప్పడం మీకు తగునా? అని ముద్రగడను చినరాజప్ప ప్రశ్నించారు.